వ్యాక్సినేషన్‌ ప్రారంభం: రెండో డోస్‌ వేసుకునేదాకా ప్రయాణాలొద్దు

- December 24, 2020 , by Maagulf
వ్యాక్సినేషన్‌ ప్రారంభం: రెండో డోస్‌ వేసుకునేదాకా ప్రయాణాలొద్దు

కువైట్: కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ఆరంభమయ్యింది. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్నవాళ్ళకి రెండో వ్యాక్సిన్‌ తీసుకునేవరకూ ప్రయాణాలు చేయొద్దంటూ కువైట్‌ అథారిటీస్‌ సూచించాయి. మిష్రెఫ్‌లోని ఇంటర్నేషనల్‌ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ సబాహ్‌ అల్‌ ఖాలెద్‌ అల్‌ సబా వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఏడాదిపాటు జరుగుతుందనీ, దేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని హెల్త్‌ మినిస్టర్‌ షేక్‌ డాక్టర్‌ బాజెల్‌ అల్‌ సబాహ్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ పొందగోరువారు హెల్త్‌ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాల్సి వుంటుంది. మంగలవారం నాటికి 83,000 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రస్తుతానికి దేశంలో 150,000 కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో వున్నాయి. ఇవి 75,000 మందికి సరిపోతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com