ఎపి రాజ్ భవన్ లో క్రిస్మస్ వేడుకలు
- December 25, 2020
విజయవాడ, డిసెంబర్ 25: విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాల్ లో శుక్రవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకను సూచిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను ఆనందం, భక్తితో జరుపుకుంటారన్నారు.
యేసుక్రీస్తు జననం ఎంతో ప్రాముఖ్యత సంతరించు కుందని, ఆరోజు ప్రపంచ ప్రజలను వారి పాపాల నుండి విముక్తి కల్పించటానికి దేవుడు తన కుమారుడిని భూమిపైకి పంపించాడని నమ్ముతారన్నారు. తన సిలువ, తదుపరి పునరుత్థానం ద్వారా దేవుడు మానవులకు మోక్షాన్ని, నిత్యజీవనాన్ని ఇచ్చా డన్నారు. క్రిస్మస్ అనేది ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణ యొక్క అనుబంధాలను గురించి బోధించడానికి సంతోషకరమైన జ్ఞాపకమని, యేసుక్రీస్తు జీవితం సద్గుణ జీవితాన్ని గడపడానికి మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
సిఎస్ఐ ఆల్ సెయింట్స్ చర్చికి చెందిన బిషప్ జార్జ్ కార్నెలియస్ తదితరులు ప్రార్థనలు చేసి గవర్నర్కు ఆ శీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- రీఫండ్, తేదీ మార్పులకు ఖతార్ ఎయిర్వేస్ అవకాశం..!!
- VerSe Innovation లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్.రమేష్ నియామకం









