డ్రైవింగ్లో ఫోన్, సీట్ బెల్ట్ లేకపోవడాన్ని గుర్తించనున్న రాడార్లు
- December 25, 2020
అబుధాబి:జనవరి 1, 2021 నుంచి మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించే రాడార్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నట్లు అబుధాబి పోలీస్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను అథారిటీ సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా విడుదల చేయడం జరిగింది. అరబిక్, ఇంగ్లీష్, మలయాళం మరియు ఉర్దూ భాషల్లో ఈ వీడియోను రూపొందించారు. 'వెహిక్యులర్ అటెన్షన్ అండ్ సేఫ్టీ ట్రాకర్' (విఎఎస్టి) పేరుతో ఈ రాడార్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. ట్రాఫిక్ సేఫ్టీని పెంచడమే ఈ కొత్త వధానం తాలూకు లక్ష్యం. హై రిజల్యూషన్ ఫొటోల ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్ వ్యవస్థ గుర్తిస్తుంది. ఎమిరేట్ డ్రైవర్లు, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ద్వారా వయొలేషన్ని గుర్తించగలుగుతారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









