డ్రైవింగ్లో ఫోన్, సీట్ బెల్ట్ లేకపోవడాన్ని గుర్తించనున్న రాడార్లు
- December 25, 2020
అబుధాబి:జనవరి 1, 2021 నుంచి మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించే రాడార్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నట్లు అబుధాబి పోలీస్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను అథారిటీ సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా విడుదల చేయడం జరిగింది. అరబిక్, ఇంగ్లీష్, మలయాళం మరియు ఉర్దూ భాషల్లో ఈ వీడియోను రూపొందించారు. 'వెహిక్యులర్ అటెన్షన్ అండ్ సేఫ్టీ ట్రాకర్' (విఎఎస్టి) పేరుతో ఈ రాడార్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. ట్రాఫిక్ సేఫ్టీని పెంచడమే ఈ కొత్త వధానం తాలూకు లక్ష్యం. హై రిజల్యూషన్ ఫొటోల ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్ వ్యవస్థ గుర్తిస్తుంది. ఎమిరేట్ డ్రైవర్లు, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ద్వారా వయొలేషన్ని గుర్తించగలుగుతారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







