ఆసుప‌త్రి నుండి ర‌జ‌నీకాంత్ డిశ్చార్జ్

- December 27, 2020 , by Maagulf
ఆసుప‌త్రి నుండి ర‌జ‌నీకాంత్ డిశ్చార్జ్

 

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హైదరాబాద్ అపోలో ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అధిక ర‌క్త‌పోటు కార‌ణంగా ఆయ‌న ఆసుప‌త్రిలో చేర‌గా ఆయ‌న‌కు ఈ నెల 25వ తేదీ నుండి చికిత్స అందించారు. ర‌జ‌నీకాంత్ కు అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత ఆయ‌న్ను డిశ్చార్జ్ చేశారు. ర‌జ‌నీకాంత్ కు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ర‌జ‌నీకాంత్ ఆసుప‌త్రి నుండి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నేరుగా చెన్నై బ‌య‌లుదేర‌నున్నారు. ఆసుప‌త్రిలో ఆయ‌న్ను కొంత‌మంది ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శించిన‌ట్లు స‌మాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com