అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ఆర్ధిక సాయం అందించిన 'గల్ఫ్ జనసేన'
- December 27, 2020బహ్రెయిన్: ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం మండలం, ముంజవరపుకోట్టు గ్రామం అడ్డపుంత లో నివసిస్తున్న దిగుమర్తి సరస్వతి అనే యువతి గత కొంతకాలం గా కడుపులో గడ్డలతో బాధపడుతోంది. చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఆమె కష్టాలను పలువురు ఎన్నారై జనసేన నాయకులకు తెలియజేయగా గల్ఫ్ దేశాలు (బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ) కు చెందిన గల్ఫ్ జనసేన ఎన్ఆర్ఐ ఉద్యోగులు అంతా కలిసి సరస్వతి చికిత్సకు కావలసిన కొద్ది మొత్తాన్ని సమకూర్చారు.
డబ్బులను మండల జనసేన నాయకులు చేతుల మీద ఆ కుటుంబానికి చేర్చారు గల్ఫ్ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండలం జనసేన నాయకులైన కుంపట్ల నరసింహారావు సూర్య మోహన్ రావు విజయ్ గోపాల్ , భూసయ్యకాపు, శ్రీను , ఆకుల వెంకటరంగారావు , బిక్కిన సూర్యనారాయణమూర్తి , స్వామి నాయుడు, వాసంశెట్టి కుమార్ శ్రీనివాసరావు, వెంకటేష్ శృంగవరపు, లక్ష్మణ రావు పేరాబత్తుల, సూర్య ముకుంద్, దైవాల రాంబాబు పాటి సత్తిబాబు , గుత్తుల రాంబాబు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?