అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ఆర్ధిక సాయం అందించిన 'గల్ఫ్ జనసేన'
- December 27, 2020
బహ్రెయిన్: ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం మండలం, ముంజవరపుకోట్టు గ్రామం అడ్డపుంత లో నివసిస్తున్న దిగుమర్తి సరస్వతి అనే యువతి గత కొంతకాలం గా కడుపులో గడ్డలతో బాధపడుతోంది. చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఆమె కష్టాలను పలువురు ఎన్నారై జనసేన నాయకులకు తెలియజేయగా గల్ఫ్ దేశాలు (బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ) కు చెందిన గల్ఫ్ జనసేన ఎన్ఆర్ఐ ఉద్యోగులు అంతా కలిసి సరస్వతి చికిత్సకు కావలసిన కొద్ది మొత్తాన్ని సమకూర్చారు.
డబ్బులను మండల జనసేన నాయకులు చేతుల మీద ఆ కుటుంబానికి చేర్చారు గల్ఫ్ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండలం జనసేన నాయకులైన కుంపట్ల నరసింహారావు సూర్య మోహన్ రావు విజయ్ గోపాల్ , భూసయ్యకాపు, శ్రీను , ఆకుల వెంకటరంగారావు , బిక్కిన సూర్యనారాయణమూర్తి , స్వామి నాయుడు, వాసంశెట్టి కుమార్ శ్రీనివాసరావు, వెంకటేష్ శృంగవరపు, లక్ష్మణ రావు పేరాబత్తుల, సూర్య ముకుంద్, దైవాల రాంబాబు పాటి సత్తిబాబు , గుత్తుల రాంబాబు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ









