మస్కట్:తొలి విడతలో 7 వేల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్
- December 27, 2020మస్కట్:పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఒమన్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో 7,500 మంది పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ అందించనున్నారు. తొలి విడత వ్యాక్సినేషన్ కు సంబంధించి 15,600 వ్యాక్సిన్ డోసులు గత గురువారమే ఒమన్ చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరిలో మరో 28 వేల డోసులు ఒమన్ కు చేరనున్నాయి. ప్రతి ఒక్కరికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం 15 వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉండటంతో 7,500 మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారితో పాటు దీర్ఘకాలంగా శ్వాసకోస ఇబ్బందులు, కిడ్నీ వ్యాధులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనునున్నారు.
తాజా వార్తలు
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!