మస్కట్:తొలి విడతలో 7 వేల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్

- December 27, 2020 , by Maagulf
మస్కట్:తొలి విడతలో 7 వేల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్

మస్కట్:పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఒమన్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో 7,500 మంది పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ అందించనున్నారు. తొలి విడత వ్యాక్సినేషన్ కు సంబంధించి 15,600 వ్యాక్సిన్ డోసులు గత గురువారమే ఒమన్ చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరిలో మరో 28 వేల డోసులు ఒమన్ కు చేరనున్నాయి. ప్రతి ఒక్కరికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం 15 వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉండటంతో 7,500 మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారితో పాటు దీర్ఘకాలంగా శ్వాసకోస ఇబ్బందులు, కిడ్నీ వ్యాధులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనునున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com