మస్కట్:తొలి విడతలో 7 వేల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్
- December 27, 2020
మస్కట్:పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఒమన్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో 7,500 మంది పౌరులు, ప్రవాసీయులకు వ్యాక్సిన్ అందించనున్నారు. తొలి విడత వ్యాక్సినేషన్ కు సంబంధించి 15,600 వ్యాక్సిన్ డోసులు గత గురువారమే ఒమన్ చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జనవరిలో మరో 28 వేల డోసులు ఒమన్ కు చేరనున్నాయి. ప్రతి ఒక్కరికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం 15 వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉండటంతో 7,500 మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారితో పాటు దీర్ఘకాలంగా శ్వాసకోస ఇబ్బందులు, కిడ్నీ వ్యాధులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనునున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







