వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(VPN) వినియోగిస్తున్నారా? ఐతే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
- December 28, 2020
యూఏఈ: మీరు యూఏఈ లో ఉంటూ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్-వీపీఎన్ వినియోగదారులా? ఐతే..కొన్ని జాగ్రత్తలు, ప్రభుత్వ సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కాదు..కూడదు అంటూ విరుద్ధంగా ప్రవర్తిస్తే 20 లక్షల దిర్హామ్ ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వీపీఎన్ వినియోగాన్ని యూఏఈ ప్రభుత్వం ఆమోదించటంతో చట్టబద్ధమే అయినా..ఐపీ ఆడ్రస్ సీక్రెట్ గా దాచినా..తప్పుడు సమాచారంతో వీపీఎన్ వినియోగించినా..ఇతరుల ఐడీలపై నెట్వర్క్ సేవలను వినియోగించినా యూఏఈ సైబర్ లా ప్రకారం నేరంగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వీపీఎన్ వినియోగం పెరిగిపోతోంది. 2020లో తొలి అర్ధభాగంలోనే దాదాపు 3.82 మిలియన్ల మంది వీపీఎన్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. కాలింగ్, వెబ్ సైట్ యాక్సెస్, గేమింగ్ అప్లికేషన్స్ సేవలను వీపీఎన్ ద్వారా పొందెందుకు యూఏఈ అనుమతించింది. అయితే..తప్పుడు సమాచారం, ఐపీ అడ్రస్ వివరాలను దాచి అక్రమంగా వీపీఎన్ సేవలను వినియోగించటం, వీపీఎన్ సేవలను దుర్వినియోగం చేయటం నేరమని...యూఏఈ ప్రభుత్వం, టీఆర్ఏ మార్గనిర్దేశకాలను తప్పకుండా పాటించాలని ఆశిష్ మెహతా అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్ నర్ ఆశిష్ మెహతా వివరించారు. అలాగే విద్వేషక ప్రచారాలు, చట్టవ్యతిరేక ఆందోళనలకు మద్దతు కూడగట్టడం, అశ్లీల వెబ్ సైట్లను యాక్సెస్ చేయటం, నేరాల పాల్పడటం లేదా నేరాలకు ఇతరులను పురికొల్పడం వంటి చర్యలను ఉపేక్షించబోరు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి సవరించిన సైబర్ చట్టం ఆర్టికల్ 1 మేరకు 50 వేల దిర్హామ్ ల నుంచి 2 లక్షల దిర్హామ్ ల వరకు జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









