ఏడాది ముగిసేలోపు రెసిడెన్సీ వీసా రెన్యువల్ చేయించుకోవాలి
- December 28, 2020
కువైట్: రెసిడెన్సీ వీసా గడువు తీరుతున్నవారు, వాటిని వీలైనంత త్వరగా రెన్యువల్ చేయించుకోవాలని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం) సూచించింది. గురువారం లోపే తమ ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేసుకోవాలనీ, రెండు వారాల పాటు ఈ సర్వీసుని సస్పెండ్ చేయనున్నారనీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 1 నుంచి 12 వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, రెన్యువల్స్ని రద్దు చేయనుంది. ఆయా వ్యవహారాలు సజావుగా నడిచేందుకోసం జనవరి 12న ఆన్లైన్ సిస్టమ్ ప్రారంభించబడుతుంది. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకే చోట గుమికూడటం అంత శ్రేయస్కరం కాదు గనుక, ఈ కోణంలో ఆన్లైన్ రెన్యువల్స్ని అందుబాటులోకి తెస్తున్నారు. కాగా, ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా రెండు కొత్త సర్వీసుల్ని లాంచ్ చేస్తున్నారు. డాక్యుమెంట్ల తాలూకు డిజిటల్ కాపీల ప్రాసెసింగ్ వంటివి ఇందులో వున్నాయి. సేవల తాత్కాలిక సస్పెన్షన్ నేపథ్యంలో ఎలాంటి సమస్యలూ ఎదురుకాకూడదంటే, ఈ వారాంతంలోపు రెన్యువల్స్ చేయించుకోవాల్సి వుంటంఉది.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









