న్యుమోనియా వ్యాక్సిన్ విడుదల చేసిన మంత్రి హర్షవర్ధన్
- December 29, 2020
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సీరం ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ మొట్టమొదటి న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ ఖన్యుమోసిల్గను విడుదల చేశారు. బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో సీరం వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. కొవిడ్19 మహమ్మారి లాక్డౌన్ సమయంలో సీరం కంపెనీ ప్రభుత్వం నుంచి మొదటి స్వదేశీ న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)ను అభివృద్ధి చేసి, లైసెన్స్ పొందిందని మంత్రి చెప్పారు.
ప్రధాని మోడి ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా తయారీ సాగిందని చెప్పారు. సీఐఐ మొట్టమొదటి స్వదేశీ న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ ‘న్యుమోసిల్’ బ్రాండ్ పేరుతో ఒకే మోతాదు (మందు సీసా, సిరంజి) సరసమైన ధరకే మార్కెట్లో లభిస్తుందని పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధి, అధునాతన వ్యాక్సిన్ల తయారీలో భారతదేశ సామర్థ్యానికి న్యుమోసిల్ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలలో మరణానికి న్యుమోనియా ప్రధాన కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష