కరోనా కొత్త స్ట్రెయిన్.. భారత్లో 6 కేసులు నమోదు
- December 29, 2020
న్యూ ఢిల్లీ:బ్రిటన్ నుంచి కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్లో అడుగుపెట్టింది...ముందుగానే అప్రమత్తమైన ప్రభుత్వం..యూకే నుంచి విమానాసర్వీసులు నిలిపివేసింది.. అంతేకాదు.. ఈ నెలలో యూకే, యూకే మీదుగా భారత్కు వచ్చినవారిని గుర్తించిన కోవిడ్ టెస్ట్లు నిర్వహించారు.. ఇక, వీరిలో కోవిడ్ పాజిటివ్గా తేలినివారిని ఐసోలేషన్కు తరలించారు.. వారికి అత్యంత సన్నిహితంగా మెలిగినవారికి సైతం టెస్టులు నిర్వహించిన క్వారంటైన్లో పెట్టారు. మరోవైపు.. పాజిటివ్గా తేలినవారి శాంపిల్స్ అటు పుణెకు, ఇటు హైదరాబాద్లోని సీసీఎంబీకి తరలించారు. మొన్నే రిపోర్టులు వచ్చాని.. గోప్యంగా ఉంటాయి రాష్ట్రాలు.. ఆ నివేదికలను కేంద్ర ఆరోగ్యశాఖకు పపంపించాయి. మొతంగా ఇవాళ కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులను ప్రకటించింది భారత ఆరోగ్యశాఖ... దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు కేసులు నమోదయినట్టు అధికారులు గుర్తించారు. బెంగళూరులో మూడు, హైదరాబాద్లో రెండు కేసులు నమోదు కాగా.. పుణెలో ఒక కేసులు వెలుగు చూసినట్టు కేంద్రం ప్రకటించింది. మరోవైపు.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై.. యూకే నుంచి వచ్చినవారిపై ఫోకస్ పెట్టాయి.. ఇప్పటికే మెజార్టీ ప్రయాణికులను గుర్తించి టెస్ట్లు నిర్వహించగా.. కనబడకుండా పోయిన మరికొందరి కోసం వేట కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!









