తెలంగాణలో ప్రవేశించిన కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌

- December 29, 2020 , by Maagulf
తెలంగాణలో ప్రవేశించిన కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌

తెలంగాణ:కరోనా కొత్తరకం వైరస్‌ స్ట్రెయిన్‌ తెలంగాణలో ప్రవేశించింది. బ్రిటన్ నుంచి వచ్చిన వరంగల్‌ వ్యక్తికి స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్దారించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి పరీక్షలు చేయగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది. ఆమెకు సోకింది కొత్త కరోనానా కాదా అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు. స్ట్రెయిన్ వైరస్ సోకిన వరంగల్‌ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com