కరోనా కొత్త స్ట్రెయిన్: జనవరి 31 వరకు విమానాలు బంద్..

- December 30, 2020 , by Maagulf
కరోనా కొత్త స్ట్రెయిన్: జనవరి 31 వరకు విమానాలు బంద్..

కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది.. మరోవైపు.. కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది.. భారత్‌లోనూ కరోనా కేసులతో పాటు.. కొత్త స్ట్రెయిన్ కేసులు కూడా టెన్షన్ పెడుతున్నాయి.. దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను 2021 జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. అంతర్జాతీయ విమానాలు జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. అయితే, ప్రత్యేక విమానాలు మరియు అంతర్జాతీయ ఎయిర్ కార్గో సర్వీసులకు ఈ ఆంక్షలు వర్తించబోవని స్పష్టం చేసింది.

కాగా, కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి మార్చి చివరి వారంలో భారతదేశం అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేసింది. రెండు నెలల విరామం తర్వాత కఠినమైన నిబంధనలు పెడుతూ మే నెలలో దేశీయ విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మే 6వ తేదీ నుంచి వందే భారత్ మిషన్ ప్రారంభించింది... ఎయిరిండియా మరియు అనేక ఇతర ప్రైవేట్ దేశీయ విమానయాన సంస్థలు వందే భారత్ మిషన్ కోసం విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత విమానసర్వీసులు ప్రారంభమైనా.. కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్‌తో మళ్లీ రద్దు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com