కరోనా కొత్త స్ట్రెయిన్: జనవరి 31 వరకు విమానాలు బంద్..
- December 30, 2020
కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది.. మరోవైపు.. కరోనా కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు అన్ని దేశాలను కలవరపెడుతోంది.. భారత్లోనూ కరోనా కేసులతో పాటు.. కొత్త స్ట్రెయిన్ కేసులు కూడా టెన్షన్ పెడుతున్నాయి.. దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను 2021 జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. అంతర్జాతీయ విమానాలు జనవరి 31 వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. అయితే, ప్రత్యేక విమానాలు మరియు అంతర్జాతీయ ఎయిర్ కార్గో సర్వీసులకు ఈ ఆంక్షలు వర్తించబోవని స్పష్టం చేసింది.
కాగా, కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి మార్చి చివరి వారంలో భారతదేశం అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేసింది. రెండు నెలల విరామం తర్వాత కఠినమైన నిబంధనలు పెడుతూ మే నెలలో దేశీయ విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మే 6వ తేదీ నుంచి వందే భారత్ మిషన్ ప్రారంభించింది... ఎయిరిండియా మరియు అనేక ఇతర ప్రైవేట్ దేశీయ విమానయాన సంస్థలు వందే భారత్ మిషన్ కోసం విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత విమానసర్వీసులు ప్రారంభమైనా.. కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్తో మళ్లీ రద్దు చేశారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









