రోడ్డు ప్రమాదంలో అజారుద్దీన్కు గాయాలు..
- December 30, 2020
టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు త్రుటిలో ఘోర ప్రమాదమే తప్పింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్ బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్కు బయలు దేరారు. అయితే.. రాజస్థాన్లోని సుర్వార్కు చేరుకోగానే ఆయన కారు అదుపు తప్పి పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి... పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్కు స్వల్ప గాయాలయ్యాయి. అటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం క్షేమంగా బయట పడ్డారు. ధాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ఇలా ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే క్రికెటర్ అజారుద్దీన్ మరో వాహనంలో హోటల్కు వెళ్లిపోయారు. డ్రైవర్ బ్రేక్ వేసే సమయంలో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అయితే.. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







