రోడ్డు ప్రమాదంలో అజారుద్దీన్కు గాయాలు..
- December 30, 2020
టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు త్రుటిలో ఘోర ప్రమాదమే తప్పింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్ బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్కు బయలు దేరారు. అయితే.. రాజస్థాన్లోని సుర్వార్కు చేరుకోగానే ఆయన కారు అదుపు తప్పి పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి... పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్కు స్వల్ప గాయాలయ్యాయి. అటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం క్షేమంగా బయట పడ్డారు. ధాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ఇలా ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే క్రికెటర్ అజారుద్దీన్ మరో వాహనంలో హోటల్కు వెళ్లిపోయారు. డ్రైవర్ బ్రేక్ వేసే సమయంలో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అయితే.. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









