రోడ్డు ప్రమాదంలో అజారుద్దీన్కు గాయాలు..
- December 30, 2020టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు త్రుటిలో ఘోర ప్రమాదమే తప్పింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్ బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్కు బయలు దేరారు. అయితే.. రాజస్థాన్లోని సుర్వార్కు చేరుకోగానే ఆయన కారు అదుపు తప్పి పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి... పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్కు స్వల్ప గాయాలయ్యాయి. అటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం క్షేమంగా బయట పడ్డారు. ధాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ఇలా ఉండగా.. ప్రమాదం జరిగిన వెంటనే క్రికెటర్ అజారుద్దీన్ మరో వాహనంలో హోటల్కు వెళ్లిపోయారు. డ్రైవర్ బ్రేక్ వేసే సమయంలో వాహనం అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అయితే.. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల