'వాహనరహిత దినోత్సవం' లో ఉత్సాహంగా పాల్గొన్న దుబాయ్ నివాసితులు
- February 21, 2016వందలాదిమంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా పర్యావరణ స్నేహపూర్వక వాహనాలతో దుబాయ్ లో సందడి చేశారు, స్థానిక మునిసిపాలిటి నిర్వహించిన ' కారు అవసరం లేని ఉచిత ప్రదర్శనకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అసమా అల్ మర్రి అనే మహిళ అల్ రాశిదియ నుండి మెట్రో ఎక్కి దుబాయ్ మునిసిపాలిటికి వచ్చారు. ప్రబుత్వ, ప్రైవేటు, పోలీస్, అంబులెన్సు తో సహా ఈ కారు అవసరం లేని కార్యక్రమంలో పాల్గొనడం చూడటానికి ఎంతో ఘనతగా ఉందని ఆమె అన్నారు. తాను ఉద్యోగ విధులకు వెళ్ళేటప్పుడు తన స్వంత కారులోనే వెళతానని, అందుకు కారణం తనకు 9 నెలల వయసున్న చిన్నారి ఉందని , ఆ బిడ్డకు అవసరమైన సరంజామాను తాను కారులో ఉంచుకొంటానని అందుకే తాను కారును ఉపయోగిస్తున్నట్లు లేదంటే తాను ఎల్లప్పుడు మెత్రోలోనే ప్రయాణిస్తానని ఆమె తెలిపారు. దుబాయ్ మునిసిపాలిటీలో ఉద్యోగినిగా పనిచేస్తున్నానని గత 7 ఏళ్ళుగా దుబాయ్ మునిసిపాలిటి నిర్వహిస్తున్న ' వాహనరహిత దినోత్సవం ' కారణంగా ప్రజలలో పర్యావరణం పట్ల ఎంతో అవగాహన పెరిగిందని అన్నారు. ఈ తరహా అవగాహన కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను కొంత మేరకు తగ్గించడానికి సహాయపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







