'వాహనరహిత దినోత్సవం' లో ఉత్సాహంగా పాల్గొన్న దుబాయ్ నివాసితులు
- February 21, 2016వందలాదిమంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా పర్యావరణ స్నేహపూర్వక వాహనాలతో దుబాయ్ లో సందడి చేశారు, స్థానిక మునిసిపాలిటి నిర్వహించిన ' కారు అవసరం లేని ఉచిత ప్రదర్శనకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అసమా అల్ మర్రి అనే మహిళ అల్ రాశిదియ నుండి మెట్రో ఎక్కి దుబాయ్ మునిసిపాలిటికి వచ్చారు. ప్రబుత్వ, ప్రైవేటు, పోలీస్, అంబులెన్సు తో సహా ఈ కారు అవసరం లేని కార్యక్రమంలో పాల్గొనడం చూడటానికి ఎంతో ఘనతగా ఉందని ఆమె అన్నారు. తాను ఉద్యోగ విధులకు వెళ్ళేటప్పుడు తన స్వంత కారులోనే వెళతానని, అందుకు కారణం తనకు 9 నెలల వయసున్న చిన్నారి ఉందని , ఆ బిడ్డకు అవసరమైన సరంజామాను తాను కారులో ఉంచుకొంటానని అందుకే తాను కారును ఉపయోగిస్తున్నట్లు లేదంటే తాను ఎల్లప్పుడు మెత్రోలోనే ప్రయాణిస్తానని ఆమె తెలిపారు. దుబాయ్ మునిసిపాలిటీలో ఉద్యోగినిగా పనిచేస్తున్నానని గత 7 ఏళ్ళుగా దుబాయ్ మునిసిపాలిటి నిర్వహిస్తున్న ' వాహనరహిత దినోత్సవం ' కారణంగా ప్రజలలో పర్యావరణం పట్ల ఎంతో అవగాహన పెరిగిందని అన్నారు. ఈ తరహా అవగాహన కారణంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను కొంత మేరకు తగ్గించడానికి సహాయపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









