గల్ఫ్ సమస్యలపై మంత్రి కేటీఆర్ ను కలిసిన వలస కార్మిక నాయకులు

- December 30, 2020 , by Maagulf
గల్ఫ్ సమస్యలపై మంత్రి కేటీఆర్ ను కలిసిన వలస కార్మిక నాయకులు

హైదరాబాద్:గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వలస కార్మిక నాయకుల బృందం బుధవారం మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి వినతిపత్రం సమర్పించారు. పాటుకూరి బసంత్ రెడ్డి, మంద భీంరెడ్డి, గన్నారం ప్రశాంత్ లు కేటీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు. 

'తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు' (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని బృందం విజ్ఞప్తి చేసింది. 

కొత్తగా గల్ఫ్ వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్ లో జారీచేసిన రెండు సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com