గల్ఫ్ సమస్యలపై మంత్రి కేటీఆర్ ను కలిసిన వలస కార్మిక నాయకులు
- December 30, 2020
హైదరాబాద్:గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వలస కార్మిక నాయకుల బృందం బుధవారం మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి వినతిపత్రం సమర్పించారు. పాటుకూరి బసంత్ రెడ్డి, మంద భీంరెడ్డి, గన్నారం ప్రశాంత్ లు కేటీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు.
'తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు' (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని బృందం విజ్ఞప్తి చేసింది.
కొత్తగా గల్ఫ్ వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్ లో జారీచేసిన రెండు సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







