గల్ఫ్ సమస్యలపై మంత్రి కేటీఆర్ ను కలిసిన వలస కార్మిక నాయకులు
- December 30, 2020
హైదరాబాద్:గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వలస కార్మిక నాయకుల బృందం బుధవారం మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి వినతిపత్రం సమర్పించారు. పాటుకూరి బసంత్ రెడ్డి, మంద భీంరెడ్డి, గన్నారం ప్రశాంత్ లు కేటీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు.
'తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు' (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని బృందం విజ్ఞప్తి చేసింది.
కొత్తగా గల్ఫ్ వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్ లో జారీచేసిన రెండు సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







