భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

- December 31, 2020 , by Maagulf
భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.ఉష్ణోగ్రతలు పడిపోవడం,సెకండ్ వేవ్ ఎఫెక్ట్, కొత్త స్ట్రెయిన్ కారణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం  భారత్లో కొత్తగా 21,821 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,02,66,674కి చేరింది.ఇందులో 98,60,280 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,57,656 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో  భారత్లో 299 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,48,738కి చేరింది.గడిచిన 24 గంటల్లో 26,139 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com