యెమెన్ ప్రధానిని టార్గెట్ చేస్తూ ఎయిర్పోర్ట్లో విధ్వంసకర దాడి, 26 మంది మృతి
- December 31, 2020యెమెన్: ప్రధాని లక్ష్యంగా జరిగిన బాంబు దాడి యెమెన్ దేశంలో మారణహోమం సృష్టించింది. 30 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడి ద్వారా ప్రధానితో పాటు నూతన మంత్రి వర్గాన్నికూడా టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యెమెన్లో గత కొన్నెళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 10 వేల మందికి పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. సుదీర్ఘ కాలంగా యెమెన్లో అస్థిరత్వం నెలకొంది. దీనిని అడ్డుకునేందుకే డిసెంబర్ 18న కొన్ని వేర్పాటువాద సంస్థలు, ప్రభుత్వం కలిసి ఓ కొత్త ఫ్రంట్గా ఏర్పడ్డాయి. పవర్ షేరింగ్ పద్ధతిలో కేబినెట్ను ఏర్పాటు చేశాయి. యెమెన్లో తాజాగా కొత్త మంత్రి వర్గం ఏర్పడి నూతన ప్రధాని ఎంపిక జరిగింది. ఈ పరిణామంపై యెమెన్ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వారు ఆదెన్ విమానాశ్రయానికి వచ్చారు. వారిని ఘనంగా స్వాగతించేందుకు ప్రభుత్వ పెద్దలకు ఘనంగా అధికారులు, ప్రజలు ఎయిర్పోర్టులో పెద్ద ఎత్తున వచ్చారు.
కొత్త ప్రధాని కోసం ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. కొద్ది సేపటికి ప్రధానితో పాటు మంత్రులతో వచ్చిన ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ప్రధాని మోయిన్ అబ్దుల్ మాలిక్, 10 మంది మంత్రులు విమానం దిగుతున్నారు. అక్కడున్న వారంతా సంతోషంతో నినాదాలు చేస్తున్నారు. ఇంతలోనే ఊహించని విధంగా భారీ శబ్దంతో ఓ బాంబు పేలింది.రన్వే దగ్గరలో ఉన్న పార్కింలోని కారు ఒకటి ఉన్నట్లుండి పేలిపోయింది. కోలాహలంతో నిండిన ఆ ప్రాంతమంతా.. అరక్షణం గడవగానే ఆర్తనాదాలతో నిండిపోయింది. బాంబు దాడిలో చనిపోయిన వారి శరీర భాగాలు తెగి చెల్లాచెదురుగా పడ్డాయి. ఒక్కసారిగా చుట్టూ పొగ అలముంకుంది. ఈ హఠాత్పరిణామంతో మిగతావారంతా ప్రాణభయంతో బయటకు వెళ్లేందుకు ముఖద్వారం వైపు పరుగులు తీశారు. ఇంతలో అక్కడ మరో బాంబు పేలింది.
ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితితో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు, విదేశీ దేశాధినేతలు ప్రకటించారు. దీనిని మూర్ఖమైన చర్యగా అభివర్ణించిన యెమెన్ నూతన ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఇలాంటి దాడులతో తమను భయపెట్టలేరని, తాము తలపెట్టిన పవిత్ర కార్యాన్ని అడ్డుకోలేరని నూతన మంత్రి వర్గం ప్రకటించింది. కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం.. కారు పేలడానికి దుండగులు రాకెట్ బాంబును వినియోగించారు. ముఖద్వారం వద్ద కూడా బాంబు పేలిన అనంతరం దుండగులు కాల్పులకు కూడా తెగబడ్డారు. ఈ దాడికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను వణికిస్తున్నాయి. ఈ దాడికి ఇరాన్ అనుకూల హుతి రెబెల్స్ కారణంగా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మొత్తం 26 మంది మృతి చెందారని, 50 మంది వరకు గాయాలపాలవగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. అయితే క్షతగాత్రుల్లో అనేకమంది కొనఊపిరితో ఉన్నారని, అందువల్ల మరణాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా వెల్లడించింది. ఈ దాడి నుంచి ప్రధాని సహా నూతన మంత్రివర్గం సురక్షితంగా బయటపడ్డారని యెమెన్ అధికారులు తెలిపారు.
Multiple explosions and gunfire rocked Yemen’s Aden airport on Wednesday as a new cabinet flew in from its refuge in Saudi Arabia, killing dozens and wounding many more, according to the Al-Masdar news website.
— Bloomberg Quicktake (@Quicktake) December 30, 2020
Read more from @Business https://t.co/rvzyCVmnMS pic.twitter.com/ORMdb34VfC
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్