యువకుడిని మోసం చేసిన దంపతులు...అరెస్ట్ చేసిన రాచకొండ పోలీస్
- January 02, 2021
హైదరాబాద్: ఓ వెబ్సైట్లో నకిలీ ప్రొఫైల్ పెట్టి యువకుడిని మోసం చేసిన దంపతులు ఏకంగా రూ.21లక్షలు దోచుకున్నారు. యువకుడు అందించిన ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అ దంపతులను అరెస్టుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన కంపా హృదయానంద్ అనే యువకుడు 2017లో అనూష అలియాస్ హారిక అనే యువతిని పెండ్లి చేసుకున్నారు. అనంతరం హృదయానంద్ అనారోగ్యం పాలవడంతో ఏ పనీ చేయలేకపోవడంతో హారిక హైదరాబాద్లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తుంది. చాలీచాలని సంపాదనతో సంతృప్తి చెందక ఆన్లైన్ మోసాలకు పథకం వేశారు. హారికా హృదయానంద్ అనే పేరుతో ఓ ఫేక్ ప్రొఫైల్ తయారుచేసి గుర్తుతెలియని అందమైన యువతి ఫొటోతో ఇండియన్ డేటింగ్.కామ్ అనే వెబ్సైట్లో పోస్టుచేశారు. నేరెడ్మెట్కు చెందిన డోనాల్డ్ హోరసీస్ రోజారియో అనే వ్యక్తి చాటింగ్ మొదలెట్టాడు. హృదయానంద్ తాను యువతిలా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. చివరకు గుండె జబ్బుతో బాధపడుతున్న తన తల్లి ఆపరేషన్ కోసం డబ్బు కావాలని కోరింది. అతను ఆన్లైన్లో డబ్బు పంపాడు. మరికొన్ని రోజుల తర్వాత తల్లి మరణించిందని, తన సోదరి సర్జరీ చేయించాలని పలుమార్లు డబ్బు అడిగింది. ఇలా పలు దఫాలుగా డోనాల్డ్ రూ.21లక్షలు ఆమెకు ఆన్లైన్లో పంపాడు. ఆ తర్వాత కూడా పెళ్లిని వాయిదా వేస్తూ రావడంతో అనుమానించిన డోనాల్డ్ రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయవాడకు వెళ్లి నిందితులను పట్టి తెచ్చారు. శుక్రవారం ఇద్దరిని రిమాండుకు తరలించారు. పెళ్లి విషయంలో ఆన్లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్క్రైమ్ ఏసీపీ హరినాథ్ నెటిజన్లకు సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









