భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
- January 03, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.ప్రస్తుతం కేసులు 20 వేలకు దిగువున నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గుతున్నా, కొత్త కరోనా స్ట్రెయిన్ భయం కారణంగా నిబంధనలు కొనసాగిస్తున్నారు.భారత ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 18,177 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,23,965కి చేరింది.ఇందులో 99,27,310 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,44,220 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 217 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,49,435కి చేరింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









