విదేశీ కార్మికులకు ఒమాన్ శుభవార్త
- January 03, 2021
మస్కట్:కోవిడ్ సంక్షోభం, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశీ కార్మికులకు ఒమాన్ గుడ్ న్యూస్ అందించింది. విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీ కార్మికులు తమ గుర్తింపు కార్డుల గడువు ముగిసినట్లైతే ఇక నుంచి వాటిని రెన్యూవల్ చేసుకోవచ్చని ప్రకటించింది. పలు ఫ్యాక్టరీలు, కంపెనీలలో కార్మికుల కొరతను అధిగమించేందుకు ఒమాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహమ్మారి గడ్డు కాలాన్ని ఎదుర్కొని ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఒమన్ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి పలు వెసులుబాట్లు కల్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా కార్మికుల కొరతను తీర్చేందుకు గుర్తింపు కార్డులను రెన్యూవల్ చేసుకోని వారికి జరిమానాలను కూడా రద్దు చేసింది. అలాగే సంక్షోభ సమయంలో గడువు ముగిసిన కంపెనీల అనుమతులను కూడా మరికొన్నాళ్లు పొడిగించింది. కంపెనీలు కార్మికులను వేగంగా భర్తీ చేసుకునేందుకు విదేశీయులకు తాత్కాలిక వీసాలను మంజూరు చేసేందుకు ఓకే చెప్పింది. అంతేకాదు..ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు ఉన్న యాజమాన్యాలు...తమ కార్మికులను అవసరం మేరకు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అవసరం అనుకుంటే వేరే యాజమాన్యాల ఆధ్వర్యంలోని కంపెనీల నుంచి లిఖిత పూర్వక ఒప్పందం ద్వారా కార్మికులను అద్దెకు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఒమాన్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







