‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ ట్రైలర్ విడుదల

- January 04, 2021 , by Maagulf
‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ ట్రైలర్ విడుదల

హైదరాబాద్:రచయితల సంఘం అధ్యక్షుడు ఏల్చూరి వెంకట్రావు తనయుడు రంజిత్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం  ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’. వి.జి.ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వీరాస్వామి జి. దర్శక నిర్మాతగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. నారా రోహిత్ ట్రైలర్ ను లాంఛ్  చేశారు. ట్రైలర్‌ విడుదల అనంతరం.. నారా రోహిత్‌ మాట్లాడుతూ.. '' హీరోగా పరిచయం అవుతున్న రంజిత్ నాకు గుడ్ ఫ్రెండ్. థ్రిల్లర్ జానర్స్ ఇప్పటికే చాలా వచ్చాయి. ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ట్రైలర్‌ చాలా బాగుంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ.. టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను" అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com