తెలంగాణలో 253 కోవిడ్ పాజిటివ్ కేసులు
- January 05, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 253 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 317 మంది కరోనా బారినపడి కోలుకున్నారు.. ఇక, మరో ముగ్గురు కరోనాతో మృతిచెందారు.. దీంతో.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,993కు చేరుకోగా.. ఇప్పటి వరకు 2,81,400 మంది రికవరీ అయ్యారు.. మృతుల సంఖ్య 1554కి పెరిగింది... మరోవైపు.. దేశంలో కరోనా మరణాలశాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పరిమితం అయ్యింది.. రికవరీ రేటు దేశ్యాప్తంగా 96.2 శాతం ఉంటే.. రాష్ట్రంలో 97.71 శాతానికి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,039 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 2,793 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్టు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. కోవిడ్ బులెటిన్ ప్రకారం 42,485 శాంపిల్స్ పరీక్షించారు.. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్ల సంఖ్య 70,61,049కు చేరింది. తాజా కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 61 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష