యుకె:మళ్లీ లాక్డౌన్.. కొత్త స్ట్రెయిన్ కలకలం
- January 05, 2021లండన్:ఇంగ్లండ్లో దాదాపు 56 మిలియన్ల మంది ప్రజలు మళ్లీ లాక్డౌన్ ఆంక్షల్లో ఉన్నారు. ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగే ఈ లాక్డౌన్ ద్వారా స్ప్రెడ్డింగ్ ఇన్ఫెక్షన్ రేట్లను తగ్గించడానికి ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం చెప్పారు. ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలల మూసివేతతో సహా ఈ చర్యలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. ఇప్పటికే దేశంలో అనేక మంది కరోనాతో మరణించారు. జాన్సన్ మాట్లాడుతూ, సోమవారం నాటికి, కోవిడ్తో దాదాపు 27,000 మంది ఆసుపత్రిలో ఉన్నారు - గత ఏడాది ఏప్రిల్లో నమోదైన కరోనా కేసుల గరిష్ట స్థాయి కంటే 40 శాతం ఎక్కువ అని అన్నారు. గత మంగళవారం, కేవలం 24 గంటల్లో 80,000 మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో చాలా మంది ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ బారిన పడినందున టీకాలు తయారుచేసేటప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వేరియంట్ను అదుపులోకి తీసుకురావడానికి కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..