ఆందోళన కలిగిస్తున్న భారతీయుల ఆత్మహత్యలు
- February 22, 2016
దోహా విల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 53 రోజుల్లోనే మొత్తం 9 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఎయిర్పోర్ట్ రోడ్డులో ఇంజనీరింగ్ ఫర్మ్ను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఈ వ్యక్తి తొలుత కంపెనీని సమర్థవంతంగా నిర్వహించి, మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 18 నెలలుగా పరిస్థితులు తారుమారయ్యాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మృతుడి భార్య ఇటీవల కాంట్రాక్ట్ కోల్పోయారు. ఆమె పనిచేస్తున్న సంస్థ యజమాని తమ వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గించుకోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మృతుడి సన్నిహితులు ఈ ఘటన పట్ల తాము షాక్ చెందినట్లు చెప్పారు. ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తి అనీ, ఆర్థిక ఇబ్బందుల గురించి ఎవరి వద్దా ఎప్పుడూ చెప్పలేదని వారు అన్నారు. ఓ లోకల్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో మృతుడు లోన్ స్వీకరించినట్లు తెలియవస్తుంది. ఆత్మహత్యల నివారణలో సన్నిహఙతుల పాత్ర కీలకమని సైకాలజిస్ట్ ఒకరు చెప్పారు. 2016 ప్రారంభం నుంచి ఇద్దరు నేపాలిలు, ఒక శ్రీలంక వలదారుడు ఖతార్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







