రస్ అల్ ఖైమాలో సెక్యూరిటీ కెమెరాలు
- February 22, 2016
క్రైమ్ రేట్ తగ్గించడానికీ, అలాగే భద్రత పెంచడానికి అధికారులు ఎమిరేట్ వ్యాప్తంగా సెక్యూరిటీ కెమెరాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమైన భవనాలు, పబ్లిక్ స్పేసెస్ మరియు, స్ట్రీట్స్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు ధృవీకరించారు. 40,000 ఎస్టాబ్లిష్మెంట్స్, వీటిల్లో ఎక్కువగా ఫెడరల్ మరియు లోకల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇక నుంచి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల పర్యవేక్షణలోకి వెళ్ళనున్నాయి. వారంలో ఏడు రోజులు, రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ కెమెరాలు పనిచేస్తాయి. రస్ అల్ ఖైమా కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నువామి ఈ వివరాల్ని వెల్లడించారు. 18 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన అన్నారు. రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి డైరెక్షన్లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని చెప్పారాయన. కెమెరాల్లో చిత్రీకరించిన విజువల్స్ని 90 రోజులపాటు నిక్షిప్తం చేసేందుకూ తగిన ఏర్పాట్లున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు మాత్రమే ఈ కెమెరాల్లోని విజువల్స్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







