ఏ.పీ హైకోర్టు కొత్త సీజే అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం

- January 06, 2021 , by Maagulf
ఏ.పీ హైకోర్టు కొత్త సీజే అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం

అమరావతి:ఏ.పీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామితో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్,పలువురు న్యాయమూర్తులు,పలువురు రాష్ట్ర మంత్రులు,పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు,న్యాయవాదులు,న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com