భారత్ లో పెరిగిన కరోనా కేసులు

- January 06, 2021 , by Maagulf
భారత్ లో పెరిగిన కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోయాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,088 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 264 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 21,314 మంది కరోనా బారిన పడినవారు పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య  1,03,74,932 కు చేరుకోగా... ఇప్పటి వరకు 99,97,272 మంది కోలుకున్నారు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,27,546 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటి వరకు మృతిచెందనవారి సంఖ్య 1,50,114 కు పెరిగింది.. మరోవైపు.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,31,408  కోవిడ్ శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ICMR ప్రకటించింది.. దీంతో.. మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 17,74,63,405కు పెరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com