జనవరి 26 వరకు టూరిస్ట్ వీసాలను పొడిగించిన యూఏఈ
- January 06, 2021
యూఏఈ:డిసెంబర్ 19 నుంచి జనవరి 15 మధ్య కాలంలో వీసా గడువు ముగిసిన పర్యాటకులకు యూఏఈ తీపి కబురు అందించింది. దేశ పర్యటనలో ఉన్న పలు దేశాల పర్యాటకుల వీసా గడువును ఈ నెల 26వరకు పొడిగిస్తున్నట్లు విదేశీ వ్యవహారాలు, నివాస అనుమతుల డీజీ కార్యాలయం వెల్లడించింది. యూరప్ దేశాల్లో స్ట్రెయిన్ కలకలంతో ప్రయాణ అంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో టూరిస్ట్ వీసాల గడువును నెల పాటు పెంచాలని గత నెల 27నే యూఏఈ ప్రధాని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధాని ఆదేశాల మేరకు వీసా ఎక్స్టెన్షన్ అమల్లోకి వచ్చినట్లు పలు దేశాల పర్యాటకులకు ఆయా దేశాల ఎంబసీలు, ట్రావెల్ ఏజెంట్లు సమాచారం అందిస్తున్నారు. ఇంకా స్పష్టమైన సమాచారం కావాలనుకునే వారు..డిసెంబర్ 19తో వీసా గడువు ముగిసిన వారు www.amer.ae లింక్ ద్వారా తమ వీసా గడువు పెరిగిందో లేదో తెలుసుకోవచ్చు.
యూఏఈ నిర్ణయం పట్ల పలువురు పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు బిడ్డతో సహా వచ్చిన ఓ కెనడా మహిళా..వీసా పొడిగింపు వార్తను ట్రావెల్ ఏజెంట్ ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు. దీంతో తన తిరుగు ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకున్నానని, మరికొద్ది రోజులు తన భర్తతో కలిసి ఉండేందుకు అవకాశం దక్కిందని ఆమె ఆనందంగా చెబుతోంది. మనవరాలిని చూసేందుకు భారత్ నుంచి వెళ్లిన మరో మహిళ కూడా వీసా పొడిగింపుపై ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలె తమకు పుట్టిన సంతానాన్ని చూసేందుకు అమ్మ యూఏఈ వచ్చిందని, వీసా గడువు పెంపుతో మరో మూడు వారాలు మా అమ్మకు మనవరాలితో కలిసి ఉండేందుకు అవకాశం దక్కిందని సంతోషంగా చెప్పింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







