తెలంగాణలో కొత్తగా 379 కరోనా కేసులు

- January 07, 2021 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 379 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  నిన్నటి బులెటిన్ ప్రకారం కేసుల సంఖ్య పెరగ్గా, ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కేసులు కొంతమేర తగ్గాయి.  తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో 379 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,789కి చేరింది.  ఇందులో 2,82,177 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,053 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1559కి చేరింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com