కోవిడ్ వ్యాక్సిన్: ముందంజలో యూఏఈ, ఇజ్రాయెల్, బహ్రెయిన్
- January 07, 2021
వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ రేటు పరంగా ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందంజలో వుంది. సగటున 100 మందిలో 15.83 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఇజ్రాయెల్లో. ఆ తర్వాతి స్థానంలో యూఏఈ నిలిచింది. యూఏఈలో సగటున 100 మందిలో 8.35 డోసుల్ని ఇచ్చారు. మూడో స్థానాన్ని బహ్రెయిన్ (100 మందిలో 3.75 మంది) దక్కించుకుంది. యూకే, డెన్మార్క్, రష్యా, కెనడా, జర్మనీ, క్రొయేషియా, చైనా, ఇటలీ, స్పెయిన్ మరియు ఎస్టోనియా తర్వాతి స్థానాల్లో వున్నాయి. వ్యాక్సిన్ డ్రైవ్లను విజయవంతంగా నడపడంలో ఇజ్రాయెల్, యూఏఈ అత్యంత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రెండు దేశాల్లోనూ జనాభా దాదాపు సమానమే. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం యూఏఈలో 9.77 మిలియన్ల మంది జనాభా వుండగా, ఇజ్రాయెల్లో 9.05 మిలియన్ల మంది జనాభా వున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







