జనవరి 9న 16వ ప్రవాసి భారతీయ దివస్..NRI ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
- January 07, 2021
విదేశాల్లో ఉంటున్న భారతీయులు.. మాతృదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా నిర్వహించే ప్రవాసీ భారతీయ దినోత్సవానికి సమయం ఆసన్నమైంది. మహాత్మాగాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన సంఘటనను పురస్కరించుకొని ప్రవాసీ భారతీయ దివస్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే..ఈ సారి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వర్చువల్ గానే కన్వెన్షన్ నిర్వహిస్తున్నారు. జనవరి 9న ఉదయం 9 గంటలకు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతారు. ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాల నడుమ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో ప్రవాసీయుల పాత్ర, కోవిడ్ సవాళ్లు, ప్రవాసీ భారతీయ సమ్మన్ అవార్డుల వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇక పీబీడీకి ముందు రోజున(జనవరి 8) ప్రీ-పీబీడీ యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఫేస్ బుక్ తో పాటు యూట్యూబ్ లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ పీబీడీ ప్రత్యేక అథితిగా పాల్గొంటారు. కేంద్రమంత్రులు కిరన్ రిజిజు, మురళీధరన్ పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాదు...పీబీడీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న ఎన్ఆర్ఐలు https://vircon24.com/16th-pbd-convention-2021/login లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు, భారత సంతతికి చెందిన వారు పాల్గొనాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







