జనవరి 9న 16వ ప్రవాసి భారతీయ దివస్..NRI ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
- January 07, 2021విదేశాల్లో ఉంటున్న భారతీయులు.. మాతృదేశ అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా నిర్వహించే ప్రవాసీ భారతీయ దినోత్సవానికి సమయం ఆసన్నమైంది. మహాత్మాగాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చిన సంఘటనను పురస్కరించుకొని ప్రవాసీ భారతీయ దివస్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే..ఈ సారి కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వర్చువల్ గానే కన్వెన్షన్ నిర్వహిస్తున్నారు. జనవరి 9న ఉదయం 9 గంటలకు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతారు. ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగాల నడుమ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో ప్రవాసీయుల పాత్ర, కోవిడ్ సవాళ్లు, ప్రవాసీ భారతీయ సమ్మన్ అవార్డుల వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇక పీబీడీకి ముందు రోజున(జనవరి 8) ప్రీ-పీబీడీ యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఫేస్ బుక్ తో పాటు యూట్యూబ్ లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ పీబీడీ ప్రత్యేక అథితిగా పాల్గొంటారు. కేంద్రమంత్రులు కిరన్ రిజిజు, మురళీధరన్ పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాదు...పీబీడీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న ఎన్ఆర్ఐలు https://vircon24.com/16th-pbd-convention-2021/login లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు, భారత సంతతికి చెందిన వారు పాల్గొనాలని ప్రభుత్వం కోరింది.
తాజా వార్తలు
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా