ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది శిశువులు మృతి

- January 09, 2021 , by Maagulf
ఆస్పత్రిలో  ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది శిశువులు మృతి

మహారాష్ట్రలో ఘోర అగ్రప్రమాదం 10 మంది శిశువుల ప్రాణాలు తీసింది... ఈ ఘటన భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భండారా జిల్లా ఆసుపత్రిలోని న్యూ బోర్న్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో... ఎన్‌సీయూలో మొత్తం 17 మంది చిన్నారులుండగా... వారిలో ఏడుగురిని రక్షించగలిగారు.. కానీ, అప్పటికే 10 మంది మృత్యువుఒడికి చేరారు.. అయితే, ఉన్నట్టుండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మంటలు చెలరేగాయి... మొదట పొగ రావడాన్ని గుర్తించిన నర్సు... మిగతా సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చింది... వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు.. కానీ, అప్పటికే 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com