ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది శిశువులు మృతి
- January 09, 2021మహారాష్ట్రలో ఘోర అగ్రప్రమాదం 10 మంది శిశువుల ప్రాణాలు తీసింది... ఈ ఘటన భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భండారా జిల్లా ఆసుపత్రిలోని న్యూ బోర్న్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో... ఎన్సీయూలో మొత్తం 17 మంది చిన్నారులుండగా... వారిలో ఏడుగురిని రక్షించగలిగారు.. కానీ, అప్పటికే 10 మంది మృత్యువుఒడికి చేరారు.. అయితే, ఉన్నట్టుండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మంటలు చెలరేగాయి... మొదట పొగ రావడాన్ని గుర్తించిన నర్సు... మిగతా సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చింది... వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు.. కానీ, అప్పటికే 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?