తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 09, 2021హైదరాబాద్:తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోయింది... రోజువారి కేసుల సంఖ్య 300 దిగువకు పడిపోయింది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతిచెందారు. ఇదే సమయంలో 474 మంది కోలుకున్నారు. దీంతో...కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,433కు చేరుకోగా... 2,83,048 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,563 మంది కరోనాతో మృతిచెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 97.79 శాతంగా ఉంటే.. భారత్లో 96.4 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 4,822 యాక్టివ్ కేసులు ఉండగా... వీరిలో 2,614 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇక, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 31,187 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్ల సంఖ్య 72,15,785కు చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!