కరోనా వ్యాక్సిన్ కు రెడీ అయిన తెలంగాణ
- January 09, 2021
హైదరాబాద్:ఈ నెల 16న వ్యాక్సినేషన్ కు తెలంగాణ రాష్ట్రం సిద్ధం అయింది. 16వ తేదీన తెలంగాణలో 139 సెంటర్లలో వాక్సిన్ జరగనుంది. ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 139 సెంటర్లలో మొదటిరోజు 13900 మందికి టీకా వేయనున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లు రెండు లక్షల తొంభై వేల మంది వాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ డేట్ను మోడీ ప్రభుత్వం అధికారికంగా ఇవాళ ప్రకటించింది. ఇప్పటి వరకు దీనిపై అనేక వార్తలు వచ్చాయి. అయితే... తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. జనవరి 16వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మొదటగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా టీకా లభిస్తుంది. వీరంతా కలిపి దేశంలో 3 కోట్ల మంది వరకు ఉంటారని కేంద్రం అంచనా వేసింది. మొదట వీరందరికీ కరోనా టీకా వేసిన తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు. 16వ తేదీన రాష్ర్టంలోని రెండు వాక్సిన్ కేంద్రాలతో ప్రధానమంత్రి ఇంటరాక్ట్ కానున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









