మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- February 13, 2026
హైదరాబాద్: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ దే హవా కనిపించింది. 116 మున్సిపాలిటీ స్థానాల్లో 66 చోట్ల కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఓవరాల్ గా 1347 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కేంద్రంలో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మున్సిపల్ కేంద్రంలో ఉన్న 15 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కేంద్రంలోనూ 16 స్థానాలకు 16 చోట్ల విజయం సాధించింది.
అటు కార్పొరేషన్లలోనూ హస్తం హవా కనిపించింది. ఏడు కార్పొరేషన్లకు గాను 4 కాంగ్రెస్ వశమయ్యాయి. రామగుండం, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 15 స్థానాలతో ముందంజలో ఉంది. కార్పొరేషన్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపలేదు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ గెలుపొందింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో లీడ్ లో ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఐ జోష్ కనిపించింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది.
116 మున్సిపాలిటీల్లో 67 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. బీఆర్ఎస్ 15 చోట్ల గెలిచింది. 36 చోట్ల హంగ్ ఏర్పడింది. ఒక చోట ఇతరులు గెలిచే అవకాశం ఉంది. కార్పొరేషన్లలో వార్డుల వారీగా చూస్తే.. 176 వార్డుల్లో కాంగ్రెస్, 53 వార్డుల్లో బీఆర్ఎస్, 73 వార్డుల్లో బీజేపీ గెలిచాయి. 76 వార్డుల్లో ఇతరులు గెలుపొందారు. మున్సిపాలిటీల్లో అత్యధికంగా 1376 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొంది. 723 వార్డుల్లో బీఆర్ఎస్, 261 వార్డుల్లో బీజేపీ, 252 వార్డుల్లో ఇతరులు గెలిచారు. గతంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ గెలుపొందిందని సీఎం రేవంత్, టీపీపీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









