ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- February 13, 2026
న్యూ ఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన చర్యలు చేపట్టింది. విమానయాన భద్రతా ప్రమాణాలను విస్మరించినందుకు గాను ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 5న కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.
గతేడాది నవంబర్ 24, 25 తేదీల్లో ఎయిర్ ఇండియాకు చెందిన ఒక ఎయిర్బస్ ఏ320 విమానం, తప్పనిసరిగా ఉండాల్సిన ఎయిర్వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ (ARC) లేకుండానే కార్యకలాపాలు సాగించింది. తగిన అనుమతులు మరియు భద్రతా తనిఖీలు లేకపోయినప్పటికీ, ఆ రెండు రోజుల వ్యవధిలో ఏకంగా ఎనిమిది సార్లు ఈ విమానాన్ని నడిపినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారం పై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా విమానాలను నడపడం వల్ల ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడటమే కాకుండా, విమానయాన రంగంపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని ఆరోపించింది. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరానిదని ఈ సందర్భంగా డీజీసీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







