యువతను తీవ్రవాదం నుంచి రక్షించాలి
- February 22, 2016
బహ్రెయిన్లో యువతను తీవ్రవాదం నుంచి రక్షించాల్సి ఉందని ఇన్ఫర్మేషన్ మరియు పార్లమెంట్ ఎఫైర్స్ మినిస్టర్ ఇసా అబ్దుల్ రహమాన్ అల్ హమ్మాదీ చెప్పారు. యువతను పెడతోవలో నడిపించేందుకు తీవ్రవాద సంస్థలు, అసాంఘీక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. 14 నుంచి 18 ఏళ్ళ వయసున్న వారు విదేశాలకు వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు వారిని జాగ్రత్తగా పరిశీలించాలనీ, వీరినే ఎక్కువగా తీవ్రవాదులు ఫోకస్ చేస్తున్నారని అబ్దుల్ రహమాన్ వెల్లడించారు. పార్టీలు, కుటుంబం, కమ్యూనిటీ ఇలాంటి వారి పట్ల పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలని, సమాజం పట్ల బాధ్యతను వారికి నేర్పించాలని కోరారు అబ్దుల్ రెహమాన్. తీవ్రవాద సంస్థల్లో చేరుతున్న బహ్రెయినీ యువత శాతం మిగతా దేశాలతో పోల్చితే తక్కువేనని అన్నారు. అయినప్పటికీ ఇంకా జాగ్రత్తగా యువతను చెడు మార్గంలోకి వెళ్ళకుండా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







