ఒమన్ కంపెనీపై సైబర్ దాడి...డేటా సురక్షితమని కంపెనీ వర్గాల వెల్లడి

- January 14, 2021 , by Maagulf
ఒమన్ కంపెనీపై సైబర్ దాడి...డేటా సురక్షితమని కంపెనీ వర్గాల వెల్లడి

ఒమన్ లోని ఓ కంపెనీపై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు కంపెనీ సాఫ్ట్ వేర్ ను టార్గెట్ చేయటంతో కొద్ది మేర డేటా లాస్ అయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం...నేషనల్ డిటర్జెంట్ కంపెనీ సాఫ్ట్ వేర్ నెట్వర్క్ పై సైబర్ దాడికి గురైందని...అయితే, దాని వల్ల కంపెనీకి ఆర్ధికపరంగా ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కొద్ది మేర డేటాను కొల్పోయినప్పటికీ...మాన్యువల్ గా పూర్తి డేటా సురక్షితంగా ఉందని వెల్లడించింది. మాన్యువల్ డేటాను మళ్లీ డిజిటలైజ్ చేస్తామన్నారు. అయితే..అప్పటివరకు ఆడిట్ వ్యవహారాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ా

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com