వృద్ధులకు ఇంటి దగ్గరే వ్యాక్సిన్...బహ్రెయిన్లో మొబైల్ టీమ్స్ ఏర్పాటు
- January 14, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు బహ్రెయిన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందితేనే కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొగలమని చెబుతున్న బహ్రెయిన్ ఆరోగ్య శాఖ...కింగ్డమ్ పరిధిలోని అన్ని వర్గాలకు వ్యాక్సిన్ అందించేలా కసరత్తు చేస్తోంది. ఆరోగ్య కేంద్రాలకు రాలేని వారి కోసం మొబైల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మొబైల్ బృందాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చి వస్తారు. అయితే..మొబైల్ టీమ్స్ అవసరం ఉందని నిర్ధారించుకునేందుకు కమిటీ సూచనలు పాటించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ కావాలని ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలను ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. దరఖాస్తుల ఆధారంగా..వృద్ధుల వివరాలను తెలుసుకుంటోంది. రిజిస్టర్ లో పేర్కొన్న అడ్రస్ లకు మొబైల్ బృందాలు వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికను అనుసరిస్తోంది.వ్యాక్సిన్ కోసం ఇంకా వివరాలను నమోదు చేసుకోని వారు http://healthalert.gov.bh వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని..లేదా 444కి కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







