వృద్ధులకు ఇంటి దగ్గరే వ్యాక్సిన్...బహ్రెయిన్లో మొబైల్ టీమ్స్ ఏర్పాటు
- January 14, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు బహ్రెయిన్ అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందితేనే కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొగలమని చెబుతున్న బహ్రెయిన్ ఆరోగ్య శాఖ...కింగ్డమ్ పరిధిలోని అన్ని వర్గాలకు వ్యాక్సిన్ అందించేలా కసరత్తు చేస్తోంది. ఆరోగ్య కేంద్రాలకు రాలేని వారి కోసం మొబైల్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మొబైల్ బృందాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చి వస్తారు. అయితే..మొబైల్ టీమ్స్ అవసరం ఉందని నిర్ధారించుకునేందుకు కమిటీ సూచనలు పాటించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ కావాలని ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలను ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. దరఖాస్తుల ఆధారంగా..వృద్ధుల వివరాలను తెలుసుకుంటోంది. రిజిస్టర్ లో పేర్కొన్న అడ్రస్ లకు మొబైల్ బృందాలు వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళికను అనుసరిస్తోంది.వ్యాక్సిన్ కోసం ఇంకా వివరాలను నమోదు చేసుకోని వారు http://healthalert.gov.bh వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని..లేదా 444కి కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!







