ఇండోనేషియా విమాన ప్రమాదం...కొనసాగుతున్న గాలింపు చర్యలు
- January 14, 2021
ఇండోనేషియాలో 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం జనవరి 9న అదృశ్యమై సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే విమానం కూలిపోయినప్పటి నుంచి గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో మృతులు, విమాన శకలాలను గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వం అన్వేషన కొనసాగిస్తోంది అక్కడి ప్రభుత్వం . శ్రీవిజయ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ విమానం నుంచి విడిపోయిన కాక్పిట్ వాయిస్ రికార్డు కోసం డ్రైవర్లు థౌజెండ్ ఐలాండ్లోని జావా సముద్ర తీర ప్రాంతాల్లో గాలింపును ముమ్మరం చేశారు సహాయక సిబ్బంది. మరోవైపు మంగళవారం రోజు విమానంలో డేటాతో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని విమాన శకలాలు, మానవ అవశేషాలను సహాయక సిబ్బంది గుర్తించారు.
కాగా, విమానం గాలింపు కోసం తీవ్ర ప్రాంతాల్లో అన్వేషణను మరింతగా పెంచినట్లు రెస్క్యూ మిషన్ బృందం తెలిపింది. సముద్ర ప్రవాహంలో విమాన శిథిలాలు, బాధితులను గుర్తించే వీలుంటుందని తెలిపింది. ఈ గాలింపు కోసం 4100 మంది సహాయక సిబ్బంది, 13 హెలికాప్టర్లు, 55 ఓడలు, 18 రాఫ్ట్ బోట్లను రంగంలోకి దింపినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 141 మానవ అవశేషాలతో కూడిన బ్యాగులను పోలీస్ ఐడెంటిఫికేషన్ ఎక్స్ఫర్ట్లకు పంపారు. అలాగే ప్రభుత్వం విపత్తు బాధిత గుర్తింపు కేంద్రం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఫ్లైట్ అటెండెంట్, ఆఫ్ డ్యూటీ ఫైలట్తో పాటు మొత్తం ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు ఆ కేంద్ర అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







