తెలంగాణలో కరోనా కేసుల వివరాలు...
- January 15, 2021హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ తగ్గాయి.. నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి రోజువారి కేసులు.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు మృతిచెందారు. ఇదే సమయంలో 253 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,118కు పెరగగా.. ఇప్పటి వరకు 2,85,102 మంది రికవరీ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,574 మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల శాతం దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా ఉందని.. రికవరీ రేటు భారత్లో 96.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో 97.93 శాతానికి పెరిగినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,442 యాక్టివ్ కేసులు ఉండగా... 2,541 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.. ఇక, గురువారం రోజు రాష్ట్రంలో 19,898 కరోనా శాంపిల్స్ మాత్రమే పరిక్షించారు.. దీంతో.. ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్ల సంఖ్య 73,99,436కు చేరుకుంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు