తెలంగాణలో కరోనా కేసుల వివరాలు...
- January 15, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ తగ్గాయి.. నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి రోజువారి కేసులు.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 202 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు మృతిచెందారు. ఇదే సమయంలో 253 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,118కు పెరగగా.. ఇప్పటి వరకు 2,85,102 మంది రికవరీ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,574 మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల శాతం దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతంగా ఉందని.. రికవరీ రేటు భారత్లో 96.5 శాతంగా ఉంటే.. తెలంగాణలో 97.93 శాతానికి పెరిగినట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,442 యాక్టివ్ కేసులు ఉండగా... 2,541 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.. ఇక, గురువారం రోజు రాష్ట్రంలో 19,898 కరోనా శాంపిల్స్ మాత్రమే పరిక్షించారు.. దీంతో.. ఇప్పటి వరకు చేసిన కరోనా టెస్ట్ల సంఖ్య 73,99,436కు చేరుకుంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









