కువైట్:విమాన సంస్థలకు ఊరట..పీసీఆర్ టెస్ట్ ఛార్జీల వసూలు నిర్ణయం వాయిదా
- January 15, 2021
కువైట్ సిటీ:విమాన సంస్థలకు కువైట్ ప్రభుత్వం కొన్నాళ్ల పాటు ఊరట కల్పించింది. పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను విమాన సంస్థలే భరించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ప్రస్తుత విధానమే అవలంభించాలని సూచించింది. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన జనవరి 17 నుంచి విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే పీసీఆర్ టెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..కువైట్ మంత్రి వర్గ నిర్ణయం మేరకు కువైట్ విమానాశ్రయాల్లో నిర్వహించిన పీసీఆర్ టెస్ట్ ఛార్జీల భారాన్ని ఆయా విమాన సంస్థలే భరించాల్సి ఉంటుంది. కానీ, ఈ నిర్ణయం అమలును కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇప్పటివరకు అనుసరించిన విధానాన్నే పాటించాల్సి ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







