కువైట్:విమాన సంస్థలకు ఊరట..పీసీఆర్ టెస్ట్ ఛార్జీల వసూలు నిర్ణయం వాయిదా
- January 15, 2021
కువైట్ సిటీ:విమాన సంస్థలకు కువైట్ ప్రభుత్వం కొన్నాళ్ల పాటు ఊరట కల్పించింది. పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను విమాన సంస్థలే భరించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ప్రస్తుత విధానమే అవలంభించాలని సూచించింది. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన జనవరి 17 నుంచి విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే పీసీఆర్ టెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..కువైట్ మంత్రి వర్గ నిర్ణయం మేరకు కువైట్ విమానాశ్రయాల్లో నిర్వహించిన పీసీఆర్ టెస్ట్ ఛార్జీల భారాన్ని ఆయా విమాన సంస్థలే భరించాల్సి ఉంటుంది. కానీ, ఈ నిర్ణయం అమలును కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇప్పటివరకు అనుసరించిన విధానాన్నే పాటించాల్సి ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









