కువైట్:విమాన సంస్థలకు ఊరట..పీసీఆర్ టెస్ట్ ఛార్జీల వసూలు నిర్ణయం వాయిదా

- January 15, 2021 , by Maagulf
కువైట్:విమాన సంస్థలకు ఊరట..పీసీఆర్ టెస్ట్ ఛార్జీల వసూలు నిర్ణయం వాయిదా

కువైట్ సిటీ:విమాన సంస్థలకు కువైట్ ప్రభుత్వం కొన్నాళ్ల పాటు ఊరట కల్పించింది. పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను విమాన సంస్థలే భరించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసుకుంది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ప్రస్తుత విధానమే అవలంభించాలని సూచించింది. లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన జనవరి 17 నుంచి విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లోనే పీసీఆర్ టెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..కువైట్ మంత్రి వర్గ నిర్ణయం మేరకు కువైట్ విమానాశ్రయాల్లో నిర్వహించిన పీసీఆర్ టెస్ట్ ఛార్జీల భారాన్ని ఆయా విమాన సంస్థలే భరించాల్సి ఉంటుంది. కానీ, ఈ నిర్ణయం అమలును కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇప్పటివరకు అనుసరించిన విధానాన్నే పాటించాల్సి ఉంటుందని వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com