ఇండియా ఇన్స్యూరెన్స్ కవర్ కేవలం 62 ఫిల్స్కే
- February 23, 2016
యూఏఈ బేస్డ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వలసదారుల కోసం కొత్త ఇన్స్యూరెన్స్ విధానం అందుబాటులోకి వచ్చింది. రోజుకి కేవలం 1.87 దిర్హామ్ చెల్లించి నలుగురికి కవరేజ్ పొందవచ్చు. అలాగే, ఒక వ్యక్తి కోసం అయితే కేవలం 62 ఫిల్స్ (రోజుకి) లైఫ్ కవర్ ఇవ్వనుంది ఈ కొత్త విధానం ద్వారా. డిఎం హెల్త్ కేర్ యొక్క అరైజ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్లో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. దుబాయ్లో సోమవారం ఈ ప్లాన్స్ని వెల్లడించారు. 6000 పైగా హాస్పిటల్స్ తమ నెట్వర్క్ కింద భారతదేశంలో ఉన్నాయని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. యూఏఈలోని వలసదారులకి, వారి స్వదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగకరమని ఇన్స్యూరెన్స్ కంపెనీ చెబుతుంది. 2,400 దిర్హామ్ల విలువ చేసే పాలసీ లేదా రోజుకి 6.57 దిర్హామ్ల విలువ చేసే పాలసీ, వలసదారుడితో కలిపి ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి, సుమారు 250,000 రూపాయల కవరేజ్ని అందిస్తుందన్నారు. ఇన్స్యూరెన్స్ స్కీమ్, ఔట్ పేషెంట్ బెనిఫిట్స్ని కూడా (కేవలం ఇండియాలో మాత్రమే) అందిస్తుంది. వయసును బట్టి ప్రీమియంలో స్వల్ప మార్పులు ఉంటాయి.ఈ ఏడాదికి 10,000 పోలసీలను అమ్మాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్లకు ఈ సేవల్ని విస్తరించనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







