భారత్తో ఒమన్ వ్యూహాత్మక సంప్రదింపులు
- January 16, 2021
మస్కట్:ఒమన్ సుల్తానేట్, భారత ప్రభుత్వం మధ్య న్యూఢిల్లీలో వ్యూహాత్మక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు ఈ చర్చలు మరింత దోహదపడతాయని ఇరు దేశాలూ పేర్కొన్నాయి. ఎనర్జీ, ట్రేడ్, ఇన్వెస్టిమెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కాన్సులర్ విభాగం.. ఇలా పలు అంశాలకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ - డిప్లమాటిక్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ షేక్ ఖలీఫా బిన్ అలి అల్ హరితి, భారత విదేశాంగ శాఖ అండర్ సెక్రెటరీ సంజయ్ భట్టాచార్య ఈ సంప్రదింపుల కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్పై పోరులో పరస్పర సహకారం గురించి కూడా ఈ సందర్భంగా చర్చ జరిగింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







