డిఫెన్స్లో ఉద్యోగావకాశాలు...
- January 17, 2021న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. టెన్త్, ఇంటర్మీడియట్ అర్హతతో డిఫెన్స్లో ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశం ఇది. కేంద్ర డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్-MTS, లోయర్ డివిజన్ క్లర్క్-LDC, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 39 ఖాళీలున్నాయి. మధ్య ప్రదేశ్లోని ఆర్మీ వార్ కాలేజీ హెడ్ క్వార్టర్స్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.mod.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్లో ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్కు పోస్టులో పంపాలి.
మొత్తం ఖాళీలు- 39
సినిమా ప్రొజెక్టనిస్ట్- 1
స్టెనోగ్రాఫర్- 1
లోయర్ డివిజన్ క్లర్క్-LDC- 1
సివిలియన్ మోటార్ డ్రైవర్- 4
ఎలక్ట్రీషియన్- 1
కుక్- 2
పోస్టర్ మేకర్- 1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (వాచ్ మ్యాన్)- 4
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (సఫాయీవాలా)- 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గార్డెనర్)- 1
బార్బర్- 1
ఫాటిగ్ మ్యాన్- 8
సూపర్వైజర్- 1
ఓవర్సీర్- 1
సైకిల్ ఫిట్టర్- 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 15
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Presiding Officer,
Civilian Direct Recruitment (Scrutiny of Applications) Board,
Senior Command Wing,
Army War College,
Mhow (MP) – 453441.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం