కారు ప్రమాదం: భర్త డ్రైవింగ్.. భార్య మృతి
- January 18, 2021యూఏఈ: యూఏఈ లోని అజ్మాన్లో ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేస్తున్న క్రమంలో అనుకోకుండా వాహనం భార్య మీదకు దూసుకెళ్లడంతో మహిళ మరణించింది.వివరాల్లోకి వెళ్తే..కేరళకు చెందిన లిజీ(45) తన భర్తతో కలిసి శనివారం హెల్త్ చెకప్ కోసం తమ కమ్యూనిటీలోని ఆసుపత్రికి వెళ్లారు.అజ్మాన్ లోని ఆసుపత్రి వద్దకు వచ్చాక లిజీ కారు ఎదుట నిల్చోని వాహనాన్ని పార్కింగ్ చేస్తున్న తన భర్తకు డైరెక్షన్స్ చెబుతోంది.ఈ క్రమంలో అనుకోకుండా కారు వేగంగా ముందుకు దూసుకు రావడంతో లిజీని ఢికొని సరిహద్దు గోడకు తాకింది.
ఈ ప్రమాదంలో మహిళకు గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.పదేళ్ల క్రితమే ఈ జంట యూఏఈలో స్థిరపడ్డారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇండియాలో ఇంజనీరింగ్ చేస్తుండగా కూతురు దుబాయ్లో చదువుతోంది. కాగా ఈ విషయం తెలియగానే యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ షాక్కు గురైనట్లు ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సజద్ నిట్టికా తెలిపారు.ఈ ఘటనపై అజ్మాన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఇండియన్ అసోసియేషన్ కుటుంబానికి సహకరిస్తోందన్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం