యూఏఈ చేరుకున్న భారత మంత్రి మురళీధరన్
- January 19, 2021
భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోమవారం అబుదాబీ చేరుకున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీ చేరుకున్న మురళీధరన్కి యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ఘన స్వాగతం పలికారు. భారత వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఇండియన్ గ్రూప్స్తో సమావేశం కానున్నారు మంత్రి మురళీధరన్. మూడు రోజుల యూఏఈ పర్యటనలో మురళీధరన్, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులతో, అధికారులతో భేటీ కానున్నారు. 2019 అక్టోబర్లో చివరిసారిగా మురళీధరన్ యూఏఈలో పర్యటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ - యూఏఈ సంయుక్తంగా పనిచేశాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాలకు ఎంతో ఉపయోగకరమని ఇరు దేశాల ప్రముఖులు పలు సందర్భాల్లో అభిప్రాయ పడ్డారు. 2020 నవంబర్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ యూఏఈలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ జరిగింది.

తాజా వార్తలు
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..







