యూఏఈ చేరుకున్న భారత మంత్రి మురళీధరన్
- January 19, 2021
భారత విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోమవారం అబుదాబీ చేరుకున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీ చేరుకున్న మురళీధరన్కి యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ఘన స్వాగతం పలికారు. భారత వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఇండియన్ గ్రూప్స్తో సమావేశం కానున్నారు మంత్రి మురళీధరన్. మూడు రోజుల యూఏఈ పర్యటనలో మురళీధరన్, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖులతో, అధికారులతో భేటీ కానున్నారు. 2019 అక్టోబర్లో చివరిసారిగా మురళీధరన్ యూఏఈలో పర్యటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ - యూఏఈ సంయుక్తంగా పనిచేశాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాలకు ఎంతో ఉపయోగకరమని ఇరు దేశాల ప్రముఖులు పలు సందర్భాల్లో అభిప్రాయ పడ్డారు. 2020 నవంబర్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ యూఏఈలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ జరిగింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..