భారత్ లో కరోనా కేసుల వివరాలు

- January 22, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో 70 నుంచి 80 వేల వరకు నమోదయ్యే కేసులు ఇప్పుడు 20 వేల దిగువకు పడిపోయాయి.కేసుల సంఖ్య భారీగా  తగ్గడం ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 14,545 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,25,428కి చేరింది.ఇందులో 1,02,83,708 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,88,688 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  కరోనా బులెటిన్ ప్రకారం ఇండియాలో తాజాగా కరోనాతో 163 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,53,032కి చేరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com